Sunday, December 12, 2010

అరుణాచలం

నెలరోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి... అప్పుడే తండ్రి వారసత్వంగా ఇచ్చిన మూడువేల కోట్ల రూపాయలకు వారసుడవుతాడు... ఇది అరుణాచలం సినిమా కధ.  హీరో తన స్టైల్‌లో లక్ష్యాన్ని సాధించి తండ్రి ఆస్థికి వారసుడవుతాడు.

మనిషి డబ్బును ఎంత తక్కువ ఆశిస్తే.. మనిషిగా అతని విలువ అంత పెరుగుతుందని చెప్పడానికి మనకో ‘అరుణాచలం’ ఉన్నాడు. ఎంత గొప్ప కథ... అరుణాచలానిది!
నా అనుకున్న వారందరి నిరాదరణకు గురవుతాడు అరుణాచలం. ఉన్న ఊరికి, అయిన వారికీ దూరంగా సిటీలో బతుకుతుంటాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో అతను కోటీశ్వరుడైన సింహాచలం కొడుకునన్న నిజం తెలుసుకుంటాడు. తండ్రి కష్టార్జితం అయిన 30 వేల కోట్ల రూపాయల ఆస్తి ట్రస్టీల చేతుల్లో ఉంటుంది. ఆ ఆస్తి అరుణాచలానికి చెందాలంటే ఒక నెల రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని తండ్రి షరతు విధిస్తాడు. ఆ షరతును అరుణాచలం నిరాకరిస్తాడు. వారసత్వంగా వచ్చే సంపదతో కాలు మీద కాలేసుకుని బతికేవాడు తన దృష్టిలో మగాడు కాడనీ, తల్లిదండ్రుల ఆస్తిని ఆశించకుండా కాయకష్టంతో చెమటోడ్చి భార్యాపిల్లలను పోషించేవాడే మగాడని అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు అరుణాచలం. కాని ఆ ట్రస్టీలు తన తండ్రి ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలనుకుంటున్న నిజం తెలుసుకుని, తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. తండ్రి కష్టార్జితాన్ని పాపాత్ముల పాలవ్వకుండా కాపాడటానికి కంకణం కట్టుకుంటాడు. నెల రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అంగీకరిస్తాడు. అరుణాచలాన్ని ఓడించడానికి వారు వేస్తున్న ఎత్తులను, కుట్రలను చిత్తు చేస్తూ... చివరకు అరుణాచలం విజేతగా నిలుస్తాడు. తండ్రి నుంచి సంక్రమించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తిని పేద ప్రజలకు పంచి... మళ్లీ తను పెరిగిన ఊరికి తన వాళ్ల దగ్గరకు చేరుకుంటాడు.
అయితే, సమాజంలో మనకు అరుణాచలం లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.












సినిమా : వద్దంటే డబ్బు
తారాగణం : రామారావు ,షావుకారు జానకి ,పేకేటి శివరాం,జమున,రాజనాల (నాకు తెలిసిన వారు)
దర్శకుడు: స్వామి.వి ఆర్.

నాలుగు నెలలనుండి రాద్దామని అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను, ఇవ్వాళ కుదిరింది.


ఇక సినెమా కధ వద్దకు వస్తే రామారావు(పేకేటి శివరాం) ,శ్యాం(రామారావు) ఇద్దరు మంచి స్నేహితులు . రామారావు కవి ఐతే ,శ్యాం చిత్రకారుడు అన్నమాట. శ్యాం చాలా భయస్తుడు,అమాయకుడు ఐతే రామారావు మంచి మాటకారి ,తెలివి కలవాడు. కాని ఇద్దరికీ మంచి అవకాశాలు రాక చాలా కష్టపడుతూ వుంటారు. అప్పుడప్పుడు భోజనం కోసం శ్యాం గీసే చిత్రాలు అమ్ముతూవుంటారు .
రేఖ(జమున) ,రామారావు ప్రేమించుకుంటూ వుంటారు. ఈమె రేడియోలో గాయని.అప్పుడప్పుడు రామారావు రాసే కవిత్వాని పాడుతూవుంటుంది. అప్పుడప్పుడు వీరికి సహాయం కూడా చేస్తూ వుంటుంది.
సరోజ (షావుకారు జానకి) శ్యాం గీసే చిత్రాలకి పెద్ద అభిమాని .ఒక రోజు శ్యాం రేఖని చూసి ఆమె చిత్రం గీయాలనుకుంటాడు. అప్పుడు రేఖ తన స్నేహితురాలు సరోజని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. అలా ఆమె చిత్రాన్ని గీస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమించుకుంటారు .

సరోజ బలవంతం మీద శ్యాం తమ ప్రేమగురించి ఆమె తండ్రితో చెప్పడానికి బయలుదేరుతాడు.సరోజ తండ్రి(రాజనాల) బాగా వున్నవాడు .అతను వీళ్ళ ప్రేమను పరీక్షింప తలచి శ్యాంకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక నెలలోపు ఖర్చు చేసి రమ్మని చెబుతాడు. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అనే షరతు పెడతాడు. ఇక లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు చూడాలి. వీళ్ళు ఎంత ఖర్చు పెడదామనుకున్నా ఇంకా ఎక్కువ డబ్బులు తిరిగి వస్తూవుంటాయి.

చాలా హాస్యం వున్న సినిమా.ఇంటి అద్దె అడిగే ఇంటి యజమానురాలిని, అలాగే చేసిన అప్పు అడిగే సాయిబుని తప్పించుకోవటానికి వీళ్ళు పడేపాట్లు మొదటి భాగంలో మంచి హాస్యాన్ని పండిస్తే , లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు రెండో భాగంలో కడుపుబ్బా నవ్విస్తాయి.

పాటలు కూడా చాలా బాగుంటాయి. నాకు ఐతే " నాతొ అవుననవా " అనే పాట చాలా బాగా నచ్చింది. సంగీతం కళ్యాణం గారు .

ఈ సినెమా చూసే "బాబాయ్-అబ్బాయ్ ","అరుణాచలం" సినిమాలు తీసారు అనుకుంట. నేను ఎంత బాగా రాద్దామనుకున్నా ఇంతకంటే బాగా రాయలేకపోయాను.మీరు సినిమా చూడండి తప్పక నచ్చుతుంది ,నాది భరోసా.

No comments:

Post a Comment