Saturday, October 30, 2010

ఖుద్దార్

హరి (సంజీవ్ కపూర్) సీమ (తనూజ)ను పెళ్లాడుతాడు. హరికి ఇద్దరు తమ్ముళ్లు (సవతితల్లి కొడుకులు) ఉంటారు. వాళ్లు గోవింద్ (అమితాబ్ బచ్చన్), రాజేష్ (వినోద్ మెహ్ర). ఒకరోజు తన భర్త హరి లేని సమయం చూసి గోవింద్, రాజేష్‌లను ఇంట్లో నుంచి పంపించేస్తుంది సీమ. వాళ్లిద్దరు బొంబాయి చేరి అక్కడ రోడ్ల మీద అడుక్కుంటారు. గోవింద్ రాత్రి పగలూ బాగా కష్టపడి చిన్నతమ్ముడైన రాజేష్‌ను బాగా చదివిస్తాడు.

రాజేష్ బాగా చదువుకొని మంజూ (బిందియా గోస్వామి)ని పెళ్ళి చేసుకుంటాడు. అనుకోని సంఘటనల మూలంగా గోవింద్ ఒక హత్య కేసులో, రాజేష్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంటారు. ఈ విషయమై అన్నదమ్ములు ముగ్గురూ అనుకోని విధంగా న్యాయస్థానంలో కలుసుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ అన్నయ్య హరి అక్కడ న్యాయవాది. వారిద్దరి కేసులూ ఆయన దగ్గరికే వస్తాయి. ఆ తరువాత ఏం జరిగిందో

No comments:

Post a Comment