Saturday, October 30, 2010

చాందిని

యష్ చోప్రా నిర్మించి, దర్వకత్వం వహించిన ఈ చిత్రం 1989సం॥బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. అంతేకాకుండా తెలుగు పరిశ్రమనుండి హిందీ పరిశ్రమకు వెళ్ళిన శ్రీదేవి నెం.1 స్థానం పొందటానికి ఈ చిత్రం ఎంతో దోహదపడింది. ఇక కథ విషయంలోకి వస్తే.. రోహిత్ ఒక ఫంక్షన్‌లో చాందినిని చూసి ప్రేమిస్తాడు. అతని కుటుంబ స్థాయికి తగిన అమ్మాయి చాందిని కాదని పెద్దలు వద్దంటారు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని అనుకోకుండా జరిగిన ప్రమాదంలో రోహిత్‌కి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అతని కుటుంబసభ్యులు చాందిని వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతణ్ణి మర్చిపొమ్మని ఆమెను బలవంతం చేయగా ఆమె అక్కడనుంచి ముంబై వెళ్ళిపోతుంది. అక్కడ లలిత్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు.

No comments:

Post a Comment