గంగా సింగ్ (మందాకిని)తన సోదరుడు కరమ్తో గంగోత్రి నదికి దగ్గరలో నివసిస్తుంటారు. ఒకరోజు కలకత్తా కాలేజీ విద్యార్థి అయిన నరేంద్ర సాహే(రాజీవ్ కపూర్) గంగానది పుట్టుపూర్వోత్తరాలు, పవిత్రత గురించి రీసెర్చ్ చేయడానికి గంగ, అతని సోదరుడి సహాయం కోరతాడు. వీరిపరిచయం ప్రేమగా మారి పెళ్ళిచేసుకుంటాడు. కొన్నిరోజులకు నరేంద్ర తల్లిదండ్రులను ఒప్పించి గంగను తీసుకొనివెళతానని వారి ఊరు వెళతాడు. భర్త, కొడుకు క్షేమం కోసం రిషీకేస్ వెళుతుంది.
అక్కడ కొన్ని కారణాల వలన ఆమె చూపును కోల్పోతుంది. భగవత్ చౌదరి అనే రాజకీయకుడు ఆమెను రక్షించి ఆశ్రయం కల్పిస్తాడు. గంగ, నరేంద్ర కలుస్తారా? నరేంద్ర తల్లిదండ్రులను ఒప్పించి భార్యగా స్వీకరిస్తాడా?
No comments:
Post a Comment